జగన్ అడ్డదారుల్లో నియమించిన అధికారులందరినీ తొలగించాలి: జీవీ ఆంజనేయులు

by Disha Web Desk 18 |
జగన్ అడ్డదారుల్లో నియమించిన అధికారులందరినీ తొలగించాలి: జీవీ ఆంజనేయులు
X

దిశ,వినుకొండ: అధికారంలోకి వచ్చింది మొదలు అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌ అడ్డదారుల్లో నియమించిన అధికారులందర్నీ తొలగించాల్సిందనేనని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలతో మద్యం ప్రవాహం, అక్రమాలకు కొంత అడ్డుకట్ట పడినట్లైందన్న జీవీ ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన జగన్ భక్తులందర్నీ సాగనంపాలన్నారు. మంగళవారం వినుకొండ 19వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు జీవీ ఆంజనేయులు సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు.

వార్డులో తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాని జీవీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్ట్ లలో పెట్టారని గతంలోనే టీడీపీ తరఫున ఆధారాలతో సహా వివరాలు విడుదల చేశామన్నారు. కేంద్రంలో వివిధ సర్వీసుల నుంచి 16 మందిని డిప్యూటేషన్ పై తీసుకు రాగా వారిలో 10 మంది జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. అలా కీలక శాఖలో సొంత సామాజిక వర్గం అధికారులను నియమించిన జగన్ దోపిడికి పాల్పడుతున్నారని, ఎన్నికల సమయంలో అయినా వారందరికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు జీవీ. అలాంటి వారందరిని ఏరివేసి సమర్థులు, నిజాయితీపరులైన అధికారులకు బాధ్యతలు ఇస్తేనే ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుత, నిష్పాక్షిత వాతావరణంలో జరుగుతుందని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.


Next Story