AP Politics:సీఎం జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరిన కూటమి నేతలు

by Disha Web Desk 18 |
AP Politics:సీఎం జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరిన కూటమి నేతలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి అభ్యర్థుల వలసలు దీంతో ఏపీ రాజకీయాలు సంచలనంగా మారాయి. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ అధినేత సీఎం జగన్ మరోవైపు ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..విశాఖపట్నం జిల్లా ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కూటమి నేతలు వైసీపీ గూటికి చేరారు.

బీజేపీ,టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని దిశానిర్ధేశం చేస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్థనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి , సంపత్ కుమార్ వైసీపీలో చేరారు. యువజన విభాగం నేత ఏఎన్‌ఆర్ వైసీపీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed