జగనన్న గీసిన గీతను దాటను.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

by Dishafeatures2 |
జగనన్న గీసిన గీతను దాటను.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జగనన్న గీసిన గీతను దాటనని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తేల్చిచెప్పారు. ''రాజకీయాలు ఉంటాయ్ పోతాయ్.. కానీ బతికినా చచ్చినా సింహంలాగే బతుకుతా. దిగజారి మాత్రం బతకను. ఒకరికి తలవంచను'' అని మాజీమంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వైసీపీ కార్యకర్తల సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా అదిరిపోయేది.. బెదిరిపోయేది లేదని స్పష్టం చేశారు. ఇబ్బందులున్నాయని ఎవరి కాళ్లు మెక్కే పని చేయబోనని స్పష్టం చేశారు. ఇప్పుడు కాళ్లు మెుక్కి ఆ తర్వాత కాళ్లు లాగేసే వాళ్లు చాలా మంది ఉన్నారని, కానీ తాను అలా చేయను అంటూ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యా్ఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తనకు టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేస్తు్న్నారని కానీ తాను మాత్రం పోటీ చేసి తీరుతానని అందులో ఎలాంటి సందేహం లేదని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచే పోటీ చేస్తా

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి తీరుతారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు రాసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ గీసిన గీత దాటడు అని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అనే వాడు ఎవరికైనా తల వంచుతాడు అని అంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనని స్పష్టం చేశారు. తప్పు ఉన్నా లేకపోయినా తలవంచుతానని క్లారిటీ ఇచ్చారు. అంతేగానీ వేరేవాళ్ల ముందు తలవంచే ప్రయత్నం చేయనని స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇవ్వరని ప్రచారం చేస్తు్న్న వాళ్లంతా ఈ వారం రోజులు ప్రశాంతంగా నిద్రపోవాలని సూచించారు. ఆ తర్వాత టికెట్ వచ్చాక వాళ్లకు నిద్ర ఉండదంటూ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed