- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP News: ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్కు అనూహ్యరీతిలో తరలివచ్చిన అభిమానులు
దిశ ప్రతినిధి,అమలాపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నామినేషన్ ప్రక్రియకు ప్రజలు, అభిమానులు అనూహ్యరీతిలో తన నామినేషన్కి తరలివచ్చిన అభిమానులకు వైసీపీ నాయకులు, కార్యకర్తల అందరికీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు. తను నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఊరేగింపులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వైఎస్సార్సీపీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. విజయలక్ష్మి నగర్లో ఉన్న తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బుధవారం వేసిన తన నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అనూహ్య రీతిలో వేలాదిగా తరలి వచ్చారన్నారు. తానిచ్చిన పిలుపుకు కనీవినీ ఎరుగని రీతిలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్పందించారని తెలిపారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేశారన్నారు. తనపై చూపించిన ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అన్నారు. ఏ ఒక్కరూ రూపాయి ఆశించకుండా స్వచ్ఛంధంగా తరలి వచ్చిన వైనం తన విజయానికి సంకేతంగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పైన, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న ఎంత నమ్మకం పెట్టుకున్నారో తన నామినేషన్ ఘట్టం రుజువు చేసిందన్నారు.
ఇదే స్ఫూర్తిని మే 13 వరకు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, ఏఎంసీ చైర్మన్ నక్కా సింహాచలం, వైస్ చైర్మన్ చిక్కాల శ్రీనివాస్, వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడివరం బాపిరాజు, కౌన్సిలర్లు మదనపల్లి రవికుమార్, సవరపు సతీష్, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పలివెల సుధాకర్, ఎస్సీ నాయకులు పొలమాల సత్తిబాబు, ఉండ్రాజవరం అర్జున్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సమతం పాపారావు, బూర అమ్ములు, బూర చిన్న, పాలింగి కిషోర్, కొడమంచిలి భాస్కర్ రావు,దాసరి లాజర్, సన్మాల ధనరాజ్, కోణాల చంద్రబోస్, తుపాకుల ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.