ప్రచారం ముమ్మరం.. సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 16 |
ప్రచారం ముమ్మరం.. సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ముమ్మరం చేశారు. గురువారం మూడు సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ప్రచారానికి బయల్దేరనున్నారు. కర్నూలు, కల్యాణదుర్గం, కోడూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఫస్ట్ కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో, 3 గంటలకు కోడూరులో భారీ బహిరంగ సభలకు జగన్ హాజరుకానున్నారు. కూటమి నేతలే టార్గెట్‌గా విమర్శలు చేయనున్నారు.

Next Story

Most Viewed