Good News: పింఛన్ దారులకు గుడ్‌న్యూస్.. భారీగా పెంచిన ప్రభుత్వం

by Disha Web Desk 9 |
Good News: పింఛన్ దారులకు గుడ్‌న్యూస్.. భారీగా పెంచిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను నేడు సీఎం జగన్ విడుదల చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలో పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి జగన్ లాంఛనంగా ప్రకంటించారు. ఈ సందర్భంగా జగన్.. ఫించన్ దారులకు భారీ శుభవార్త అందించారు. రెండు విడతల్లో పెన్షన్ రూ. 3500 కు పెంపు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అమ్మ ఒడి రూ. 15 వేల నుంచి రూ. 17 వేలకు పెంచుతామన్నారు. చేయూత రూ. 75 వేల నుంచి రూ. 1. 50 లక్షలకు పెంపు చేస్తామన్నారు. కాపు నేస్తం రూ. 60 వేల నుంచి 1. 20 లక్షలకు పెంచుతామని వెల్లడించారు. ఈబీపీ నేస్తం రూ. 45 వేల నుంచి రూ. 1. 05 లక్షలకు పెంచుతామన్నారు. వైఎస్ ఆర్ సున్నా వడ్డీ కింద రూ. 3 లక్షల వరకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 9 ముఖ్య హామీలతో సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టో విజయవంతంగా విడుదల చేశారు.



Next Story

Most Viewed