వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వాలంటీర్లపై సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చేస్తోందని ఆరోపించారు. అందువల్ల వాలంటీర్లపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని సూచించారు. స్వేచ్చాయుత ఎన్నికలు-అవినీతికి అడ్డుకట్ట అనే అంశంపై విజయవాడలో జరిగిన రౌండ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ వాలంటీర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవివిత్ర బంధం ఉందన్నారు. రాష్ట్రంలోని ఓటర్ ప్రొఫైల్‌ను వాలంటీర్లు ఎప్పుడో సేకరించాలని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. తీరు మారాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉందని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ నుంచి వాలంటీర్లను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగినట్టుగానే దొంగ ఓట్ల వ్యూహ రచన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందనే అనుమానం కలుగుతుందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.


Next Story

Most Viewed