Tirupati: కోవిడ్‌తో వ్యక్తి మృతి

by Disha Web Desk 16 |
Tirupati: కోవిడ్‌తో వ్యక్తి మృతి
X

దిశ, తిరుపతి:

A person died of corona in Tirupati కోరలు చాస్తోంది. 10 రోజుల వ్యవధిలో 20 మందికి కరోనా సోకింది. తిరుపతి రుయాలో ఇప్పటికే 20 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరికి పాజిటివ్ లక్షణాలు బయట పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

ఇదిలా ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదుగురికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. తిరుపతిలో మాత్రం 20 మందికి కరోనా లక్షణాలు బయట పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా వాడాలని డాక్టర్ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. అయితే రుయా ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి ఇప్పటికే టెస్టింగ్ కిట్లు లేక పోవడం గమనార్హం.

Next Story

Most Viewed