- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫ్రస్టేషన్లో చంద్రబాబు, పవన్..సజ్జల సెన్సేషనల్ కామెంట్స్
దిశ,వెబ్డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలుగుదేశం, జనసేన పార్టీలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి లో బుధవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ తాపత్రయపడుతున్నారు అన్నారు. ఆయన ఆడుతున్న నాటకంలో పవన్ ఓ పాత్రధారి అని తెలిపారు. కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు అని తెలిపారు. కాపుల ఓట్లు గంప గుత్త గా టీడీపీకి వేయించేందుకు పవన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు పవన్ ఎందుకు లొంగిపోయారో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వైఎస్సార్సీపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.