ఏపీలోనూ ఎన్డీయేకు మెజార్టీ స్థానాలు

by Disha Web Desk 16 |
ఏపీలోనూ ఎన్డీయేకు మెజార్టీ స్థానాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే13న ఎన్నికల జరగనున్నాయి. శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. అయితే ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి విజయభేరి మోగించనుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఏపీలోనూ ఎన్డీయే కూటమికి మెజార్టీ స్థానాలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జోస్యం చెప్పారు. సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఆమె పేర్కొన్నారు.


విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పొత్తులో దక్కిన సీట్లన్నీ గెలవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 175 స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులుగా భావించి విజయానికి కృష్టి చేయాలన్నారు. ఎన్డీఏ గెలుపునకు బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇక నుంచి ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అప్పుడే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని పురంధేశ్వరి తెలిపారు.

Next Story

Most Viewed