సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. వెంటనే చర్యలకు ఆర్డర్

by Disha Web Desk 16 |
సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్..  వెంటనే చర్యలకు ఆర్డర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ధర్మాసనం సీరియస్ అయింది. తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాదు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ తీర్పును యథావిధిగా కొనసాగించాలని సూచించింది. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయొద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా తవ్వకాలు జరిపిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అటు ఎన్జీటీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Read More..

నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడవు..

Next Story

Most Viewed