తెలుగు వెలుగు విజేతలు వీరే..

by Disha Web |
తెలుగు వెలుగు విజేతలు వీరే..
X

అనంతపురం : తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కవితా పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి 191 కవితలు రాగా ప్రథమ, ద్వితియ, తృతియ బహుమతులతో పాటు మరో పది మంది కవితలను ప్రత్యేక బహుమతికి న్యాయనిర్ణేతలు ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షుడు టి.వి.రెడ్డి తెలిపారు.

కవితా పోటీల విజేతల వివరాలు ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నంద్యాలకు చెందిన కొప్పుల ప్రసాద్ కు ప్రథమ బహుమతి, సూర్యాపేట జిల్లా బాలెంలకు చెందిన సొల్లేటి ఉపేంద్రాచారికి ద్వితీయ బహుమతి, గుత్తికి చెందిన సిల్లా ఓంకారయ్యకు తృతీయ బహుమతి లభించినట్లు చెప్పారు. పోటీలలో పాల్గొన్న కవులు, కవయిత్రులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కవులు, కవయిత్రులకు, సహకరించిన మిత్రులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన డా.చీదేళ్ల సీతాలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు, అభినందనలు అందుకోవడమే కాదు పది మందిని మనం కూడా ప్రోత్సహించాలని ముందుకు వచ్చిన దాత అనంతపురం నివాసి వరలక్ష్మిగురునాథ్ కి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విజేతలకు బహుమతి, చక్కటి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, రెండు పుస్తకాలు బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed