Ap Politics:అనంత టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

by Disha Web Desk 18 |
Ap Politics:అనంత టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
X

దిశ ప్రతినిధి,అనంతపురం:టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గురువారం ఉదయం స్థానిక గుత్తి రోడ్డులోని కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఆయన ముందుకు కదలసాగారు. అయితే, అప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు కూడా అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నారు.ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

దగ్గుబాటి వర్గీయులు కూడా ప్రతి నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. తమకు సమాచారం లేకుండా ఎలా ప్రచారం ప్రారంభిస్తారని చౌదరి వర్గీయులు ప్రశ్నించారు. మొత్తమ్మీద తొలిరోజు ప్రచారం తోనే టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కినట్లయింది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చితే తప్ప సమస్య సమసిపోయేలా కనిపించడం లేదు.



Next Story