సీఎం జగన్‌పై దాడి కేసు.. ఏ2 ఎవరు.. ముగిసిన తొలి రోజు కస్టడీ?

by Disha Web Desk 16 |
సీఎం జగన్‌పై దాడి కేసు.. ఏ2 ఎవరు.. ముగిసిన తొలి రోజు కస్టడీ?
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీశ్‌కు తొలి రోజు పోలీసుల కస్టడీ ముగిసింది. ఈ కేసులో మరింతగా విచారించాలన్న కోర్టు అనుమతితో సతీశ్‌ను కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఏ2తో పాటు మరికొందరి పాత్రపైనా విచారించారు. ఏ2 ప్రోద్బలంతోనే సతీశ్ దాడి చేశారని పోలీసుల రిమాండ్ రిపోర్టులో దాఖలు చేసిన అంశాలపైనా సతీశ్‌ను ప్రశ్నించారు. ఈ రోజు కస్టడీ ముగియడంతో సతీశ్‌ను మళ్లీ జైలుకు తరలించారు. తొలి రోజు కస్టడీలో సతీశ్ పలు అంశాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఏ2 ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

కాగా విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై గులకరాయితో నిందితుడు సతీశ్ దాడి చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేముల సతీశ్‌తో సంబంధమున్న వేముల దుర్గారావును విచారించి వదిలిపెట్టారు. అయితే నిందితుడిని మరింతగా విచారించేందుకు మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది. దీంతో వేముల సతీశ్‌ను లాయర్ సమక్షంలో గురువారం కస్టడీలోకి తీసుకుని విచారించారు.



Next Story

Most Viewed