ఎన్నికల వేళ హైకోర్టులో జనసేనకు భారీ ఊరట

by Disha Web Desk 12 |
ఎన్నికల వేళ హైకోర్టులో జనసేనకు భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఈసీ ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలను మాత్రమే లోకల్ పార్టీలుగా గుర్తించి, జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీ కేటగిరిలో ఉంచింది. దీంతో ఆ పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు గుర్తును ఎవరైనా కోరితే వారికే కేటాయించే అవకాశం ఉంది. దీంతో వెంటనే జనసేన గాజు గ్లాసు గుర్తుకు రిజిస్టర్ చేసుకొగా ఈ గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే ఈ గాజు గ్లాసు గుర్తు కోసం తాము మొదట దరఖాస్తు చేసుకున్నామని,, ఆ గుర్తుని తమ పార్టీకే కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరు పార్టీల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ రోజు ఆ తీర్పును ప్రకటించగా.. జనసేన పార్టీకి ఊరట దక్కింది. గాజు గ్లాసు గుర్తుపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తే కన్ఫర్మ్ అయింది.


Next Story