మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ హవా

by  |
మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ హవా
X

దిశ,వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగుతుంది. మొత్తం 11 కార్పొరేషన్లకు ఎన్నికల జరిగాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఒంగోలు కార్పొరేషన్ 50 డివిజన్లలో వైసీపీ 43 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 6, జనసేన 1 గెలుచుకున్నాయి. తిరుపతి కార్పొరేషన్ 50 స్థానాలకు గాను వైసీపీ 48, టీడీపీ 1, గుంటూరు కార్పొరేషన్ 57 స్థానాలకు గాను వైసీపీ 33, టీడీపీ 7, జనసేన 2, ఇతరులు 2, కర్నూలు కార్పొరేషన్ 52 స్థానాలకు వైసీపీ 32 స్థానాలు కైవసం చేసుకుంది.

అనంతపురం కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా అందులో 29 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్తి విజయం సాధించారు మిగితా వాటిలో ఫలితాలు రావాల్సి ఉంది. ఇక ధర్మవరంలో 40 వార్డుల్లోనూ వైసీపీ విజయం సాధించింది. మైదుకూరు మున్సిపాలిటీలో మాత్రం వైసీపీ కంటే టీడీపీ ఒక వార్డు ఎక్కువగా గెలిచింది. మైదుకూరులో టీడీపీ 12, వైసీపీ11, ఓచోట జనసేన విజయం సాధించాయి.

విశాఖ కార్పొరేషన్ లోను వైసీపీ 27, టీడీపీ14 జనసేన ,స్వతంత్రులు, సీపీఎం అభ్యర్థులు ఒక్కో డివిజన్లలో గెలుపొందారు. విజయనగరం కార్పొరేషన్ లో ఇప్పటివరకు11 డివిజన్ల లో వైసీపీ గెలుపొందింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో 19 డివిజన్ల లో ఆ పార్టీ విజయం సాధించింది.

Next Story

Most Viewed