ఇన్‌స్టా పోస్ట్‌ చేయడమే ఆమె చేసిన తప్పు.. ఈక్వెడార్ అందెగత్తను చంపిన దుండగులు

ఈక్వెడార్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ లాండీ పర్రాగా గోయ్‌బురో హత్యకు గురయ్యారు.

Update: 2024-05-05 08:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈక్వెడార్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ లాండీ పర్రాగా గోయ్‌బురో హత్యకు గురయ్యారు. అయితే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేయడంతో దాని ఆధారంగా లొకేషన్ కనిపెట్టిన హంతకులు ఆమె ఉన్న ఏరియాకు వచ్చి కాల్పులు జరపడంతో ఘటనా స్థలంలోనే ఆమె మృత్యువాతపడ్డారు. చనిపోవడానికి ముందు ఆమె ఈక్వెడార్‌లో ఒక రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఈ మోడల్‌ను చంపడానికి ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న ఇద్దరు దుండగులు, ఆమె చేసిన పోస్ట్ ద్వారా లొకేషన్‌ను ట్రాక్ చేసి భోజనం చేస్తున్న రెస్టా‌రెంట్‌లోకి తుపాకీ కాల్పుల మోతతో ప్రవేశించారు. లోపలికి వచ్చిన వారు, తన స్నేహితునితో మాట్లాడుతున్న సమయంలో మోడల్‌పై విచాక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ తరువాత ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆమె కొద్దిసేపటికే మరణించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.

23 ఏళ్ల లాండీ ఈక్వెడార్ అందెగత్తగా పేరుంది. అలాగే సోషల్‌మీడియా స్టార్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 173,000 మంది ఫాలోవర్లను కలిగి ఉంది. అయితే ఈ హత్య ఎందుకు, ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గన్‌మెన్ పోస్ట్ ద్వారా ఆమె ఉన్న ప్రదేశాన్ని నిందితులు తెలుసుకున్నారని అధికారులు భావిస్తున్నారు. ఆమెకు మాదకద్రవ్యాల డీలర్ లియోనార్డో నోరెరోతో అఫైర్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మాదకద్రవ్యాల డీలర్ గత ఏడాది జైల్లో చనిపోగా, అతని భార్య ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Similar News