అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. యుఎస్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Update: 2023-02-14 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. యుఎస్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలాగే మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు ఆ ప్రాంత పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అనుమానితుడిని నల్లజాతి వ్యక్తిగా పోలీసులు తెలుపుతున్నారు. దాడికి పాల్పడిన దుండగుడు ఎర్రటి బూట్లు, జీన్ జాకెట్, బేస్ బాల్ క్యాప్ ధరించి ఉన్నాడు" అని యూనివర్సిటీ తెలిపింది. కాగా కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News