Iran: ఇరాన్‌లో మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు.. 28 మంది దుర్మరణం

ఇరాన్ భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రి మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్-జుల్మ్ సభ్యులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు.

Update: 2024-04-05 02:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రి మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్-జుల్మ్ సభ్యులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. అదేవిధంగా రాస్క్ కౌంటీలోని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC)కి చెందిన మిలిటరీ పోస్ట్‌తో పాటు ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయం, చబహార్ కౌంటీలోని కోస్ట్‌గార్డ్ పోలీస్ స్టేషన్‌పై గ్రూప్ జైష్ అల్-జుల్మ్ కాల్పుల మోత మోగించారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ మారణహోమంలో 18 మంది తీవ్రవాదులు, 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పేలుడు పదార్థాలను కూడా దుండగులు తమ దుస్తుల్లో పెట్టుకొచ్చారంటూ ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ మహ్మద్ పక్‌పూర్ వెల్లడించారు. ప్రస్తుతం కాల్పులు జరిగిన ప్రాంతంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగ సమాచారం. 

Tags:    

Similar News