108లో దంపతులు మృతి..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటన జిల్లాలోని పెద్ద తిప్పసముద్రం మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. సైదానీ, అబ్దుల్ రెహమాన్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో వారిని 108 వాహనంలో క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తుండగా భర్త అబ్దుల్ రెహమాన్‌ మార్గం మధ్యలోనే మృతి చెందాడు. భర్త మృతితో మనస్తాపం చెందిన భార్య సైదానీ […]

Update: 2020-09-22 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని చిత్తూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటన జిల్లాలోని పెద్ద తిప్పసముద్రం మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. సైదానీ, అబ్దుల్ రెహమాన్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

దీంతో వారిని 108 వాహనంలో క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తుండగా భర్త అబ్దుల్ రెహమాన్‌ మార్గం మధ్యలోనే మృతి చెందాడు. భర్త మృతితో మనస్తాపం చెందిన భార్య సైదానీ సైతం గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. దంపతులిద్దరూ 108 అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News