కళ్లలో కారం కొట్టి.. పోలీసులపై దాడి

దిశ, ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గత రెండురోజుల నుండి జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపెళ్లిలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు విరమింప చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. ఈ దాడిలో కొంత మంది పోలీసులకు తీవ్ర గాయాలవడంతో, వారిని […]

Update: 2021-04-10 06:55 GMT

దిశ, ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గత రెండురోజుల నుండి జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపెళ్లిలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు విరమింప చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. ఈ దాడిలో కొంత మంది పోలీసులకు తీవ్ర గాయాలవడంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News