వన్యప్రాణులను వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్

దిశ, ఏపీ బ్యూరో: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు శేషాచలం అడవిలో జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లు చిక్కారు. వారినుంచి ఓ నాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, వంట పాత్రలు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం చిత్తూరు జిల్లా చామలరేంజ్, వెల్లంపల్లి రిజర్వు ఫారెస్టు‌లో కూంబింగ్​ చేస్తుండగా బుధవారం భాకరాపేటకు చెందిన మధు (45)ఎల్లమ్మగుడిబండకు చెందిన రమణయ్య (48)పట్టుబడ్డారు. తప్పించుకున్న మరో ఇద్దరి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై కేసు […]

Update: 2020-09-23 07:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు శేషాచలం అడవిలో జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లు చిక్కారు. వారినుంచి ఓ నాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, వంట పాత్రలు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం చిత్తూరు జిల్లా చామలరేంజ్, వెల్లంపల్లి రిజర్వు ఫారెస్టు‌లో కూంబింగ్​ చేస్తుండగా బుధవారం భాకరాపేటకు చెందిన మధు (45)ఎల్లమ్మగుడిబండకు చెందిన రమణయ్య (48)పట్టుబడ్డారు. తప్పించుకున్న మరో ఇద్దరి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన రిమాండుకు పంపారు.

Tags:    

Similar News