ఆత్మపరిశీలన చేసుకోండి

దిశ, ఎల్బీనగర్: బీఎన్‌రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న.. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీఎన్‌రెడ్డి‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై లక్ష్మీప్రసన్న చేసి వ్యాఖ్యలను ఖండించారు. నాలుగేళ్లలో డివిజన్‌లోని 11 కాలనీలకు డ్రైనేజీ సమస్యను కార్పొరేటర్‌గా ఉండి ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారం లేకుండా తాము అభివృద్ధి చేస్తున్నామని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. […]

Update: 2020-06-10 10:29 GMT

దిశ, ఎల్బీనగర్: బీఎన్‌రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న.. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీఎన్‌రెడ్డి‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై లక్ష్మీప్రసన్న చేసి వ్యాఖ్యలను ఖండించారు. నాలుగేళ్లలో డివిజన్‌లోని 11 కాలనీలకు డ్రైనేజీ సమస్యను కార్పొరేటర్‌గా ఉండి ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారం లేకుండా తాము అభివృద్ధి చేస్తున్నామని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ మహిళా అధ్యక్షురాలు వి.ఇందిరారెడ్డి, జనరల్ సెక్రెటరీ అరుణ్ గౌడ్, వార్డు కమిటీ సభ్యుడు గంగం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News