పిడుగుపాటుకు గిరిజన రైతు మృతి

దిశ, డోర్నకల్: వ్యవసాయం క్షేత్రంలో పిడుగుపాటుకు గురై గిరిజన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రేకులతండా (కె) గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ధరాసింగ్ (64) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. అప్పటికే భారీ వర్షం కురవడంతో ఆ రైతు తిరుగు పయనమయ్యాడు. ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పిడుగుపడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం […]

Update: 2020-08-01 07:35 GMT

దిశ, డోర్నకల్: వ్యవసాయం క్షేత్రంలో పిడుగుపాటుకు గురై గిరిజన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రేకులతండా (కె) గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ధరాసింగ్ (64) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. అప్పటికే భారీ వర్షం కురవడంతో ఆ రైతు తిరుగు పయనమయ్యాడు.

ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పిడుగుపడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

Tags:    

Similar News