Indian Railways: రన్నింగ్‌లో ట్రైన్.. నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. చివరికి ఏం జరిగిందంటే..?

అసలే వేసవికాలం పైగా విధుల్లో ఉన్నారు, దినితో అలసిపోయారేమోగాని స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నారు.

Update: 2024-05-05 03:18 GMT

దిశ వెబ్ డెస్క్: అసలే వేసవికాలం పైగా విధుల్లో ఉన్నారు, దినితో అలసిపోయారేమోగాని స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నారు. అదే సమయంలో రైలు ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. లోకో పైలెట్ ఎన్ని సార్లు హారన్ కొట్టినా స్టేషన్ మాస్టర్ నిద్రలేవ లేదు. దీనితో రైలు అరగంట నిలిచిపోయింది. ఈ ఘటన UPలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పాట్నా-కోట మధ్య నడిచే ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్‌కు చేరుకుంది. అయితే ఆ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ మాస్టర్ అప్పటికే నిద్రపోయారు. ఈ నేపథ్యంలో స్టేషన్ మాస్టర్‌ను నిద్రలేపేందుకు లోకోపైలట్ పలుమార్లు హారన్ కొట్టారు. అయినా స్టేషన్ మాస్టర్‌కు మెలుకువ రాలేదు. దీనితో రైలు అరగంట నిలిచిపోయింది.

అలా రైలు అరగంట సేపు నిలిచిపోవడంతో ఆ రైలులోని ప్రయాణికులు అసహనానికి గురైయ్యారు. కాగా విధుల్లో ఉండి నిద్రపోయిన స్టేషన్ మాస్టర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. 

Similar News