షాకింగ్ ఘటన..మహిళ స్కూటీపై రూ.1.36 లక్షల ఫైన్
తాజాగా బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ మహిళకు ఏకంగా రూ.1.36 లక్షల ఫైన్ పడింది. ఈ విషయం తెలిసిన పలువురు షాక్కి గురికాగా..మరికొందరు ఆమె స్కూటీ ధర కంటే దానిపై ఉన్న ఫైన్ ఎక్కువ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
దిశ,వెబ్డెస్క్: తాజాగా బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ మహిళకు ఏకంగా రూ.1.36 లక్షల ఫైన్ పడింది. ఈ విషయం తెలిసిన పలువురు షాక్కి గురికాగా..మరికొందరు ఆమె స్కూటీ ధర కంటే దానిపై ఉన్న ఫైన్ ఎక్కువ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన కారణం ఏంటంటే..సదరు మహిళ పదే పదే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు ట్రిపుల్ రైడింగ్ వంటివి చేస్తూ 277 సార్లు నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఆమె హోండా యాక్టివా పై భారీ జరిమానా పడింది. ఆ స్కూటీ ఖరీదు కంటే ఫైన్ అమౌంట్ ఎక్కువ కావడం గమనార్హం. ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా..బండి పోలీసు స్టేషన్ లో పెట్టి మిగిలిన డబ్బు చెల్లించి వెళ్లాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.