టెన్త్ ఫలితాల్లో 93.5 శాతం మార్కులు.. మూర్చ పోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక

ఎదైన ప్రతిష్ఠాత్మకమైన పరీక్షా ఫలితాల్లో ఊహించని మార్కులు వస్తే షాక్ తింటారు.

Update: 2024-04-24 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎదైన ప్రతిష్ఠాత్మకమైన పరీక్షా ఫలితాల్లో ఊహించని మార్కులు వస్తే షాక్ తింటారు. ఆనందంతో గంతులేస్తారు. కానీ ఇక్కడ ఒక బాలుడు తనకు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వచ్చిన మార్కులను చూసి మూర్చ బోయి ఏకంగా ఐసీయూలో చేరాడు. అలా అని తక్కువ మార్కులు లేదండోయ్.. ఏకంగా 93.5 శాతం మార్కులు వచ్చాయి. దీంతో అతను ఒక్కసారిగా మూర్చబోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని మోడిపురంలో చోటు చేసుకుంది. మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌లో 10వ తరగతి చదివే అన్షుల్ కుమార్ బోర్డు పరీక్షల్లో 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయి మూర్ఛ బోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా అన్షుల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది.

Similar News