ఈటలను బహిరంగంగానే కలిశా.. కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్

దిశ, డైనమిక్ బ్యూరో: ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు గోల్కొండ రిసార్టులో కలిశారని, కాంగ్రెస్, బీజేపీలో లోపాయికారీ ఒప్పదం చేసుకుందని మంత్రి కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి శనివారం స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈటల రాజేందర్‌ను బహిరంగానే కలిశా. నీలాగా చీకటిలో కలవలేదు. వేము నరేందర్‌ కుమారుడి పెళ్లి పత్రిక రాసే వేడుక సందర్భంగా మేము కలిశాం. కేసీఆర్‌ చేసిన మోసం మొత్తం రాజేందర్‌ చెప్పారు. మరి ఢిల్లీ […]

Update: 2021-10-23 06:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు గోల్కొండ రిసార్టులో కలిశారని, కాంగ్రెస్, బీజేపీలో లోపాయికారీ ఒప్పదం చేసుకుందని మంత్రి కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి శనివారం స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈటల రాజేందర్‌ను బహిరంగానే కలిశా. నీలాగా చీకటిలో కలవలేదు. వేము నరేందర్‌ కుమారుడి పెళ్లి పత్రిక రాసే వేడుక సందర్భంగా మేము కలిశాం. కేసీఆర్‌ చేసిన మోసం మొత్తం రాజేందర్‌ చెప్పారు. మరి ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వచ్చిన విమానం ఎవరిది? టీఆర్ఎస్‌కు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లది కాదా?’’ అని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని, కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ధరలతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్, హరీష్ రావులు గత 20 ఏళ్లుగా జోడు గుర్రాల్లా తిరిగి ఇప్పుడేమో తనకు, ఈటలకు పడటం లేదని హరీష్‌రావు మాట్లాడుతున్నారనడం ఏంటని రేవంత్ విమర్శించారు.

Tags:    

Similar News