రైతులు ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్లు

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బంది ఏర్పాట్లు చేసిందని ఆ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. రైతుల ఫిర్యాదుల కోసం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో 1967, 180042500333, 18004254614 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, ధాన్యం విక్రయంలో ఏదైనా సమస్యలుంటే రైతులు నేరుగా ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ […]

Update: 2020-10-31 07:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బంది ఏర్పాట్లు చేసిందని ఆ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. రైతుల ఫిర్యాదుల కోసం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో 1967, 180042500333, 18004254614 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, ధాన్యం విక్రయంలో ఏదైనా సమస్యలుంటే రైతులు నేరుగా ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News