గ్రాడ్యుయేట్ ‘దొంగలు’.. Youtubeలో వీడియోలు చూసి..
దిశ ప్రతినిధి, వరంగల్ : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడి అప్పులపాలై, వ్యసనాలకు బానిసైన యువకులు చోరీలకు పాల్పడుతూ వరంగల్ పోలీసులకు చిక్కారు. ఇద్దరు దొంగలను సీసీఎస్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.42 లక్షల విలువైన 825 గ్రాముల బంగారు ఆభరణాలు, 846 గ్రాముల వెండి వస్తువులను, ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్ టాప్ను స్వాధీనం చేసుకున్నారు. సీపీ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ […]
దిశ ప్రతినిధి, వరంగల్ : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడి అప్పులపాలై, వ్యసనాలకు బానిసైన యువకులు చోరీలకు పాల్పడుతూ వరంగల్ పోలీసులకు చిక్కారు. ఇద్దరు దొంగలను సీసీఎస్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.42 లక్షల విలువైన 825 గ్రాముల బంగారు ఆభరణాలు, 846 గ్రాముల వెండి వస్తువులను, ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్ టాప్ను స్వాధీనం చేసుకున్నారు. సీపీ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎల్లామార్ గ్రామానికి చెందిన ఏనబోతుల సునీల్, కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన లావుడ్య సాగర్(19)లు కొంతకాలంగా వరంగల్, హన్మకొండ పట్టణాలతో పాటు పరిసర గ్రామాల్లో ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఉదయం వేళల్లో తాళం వేసిన ఇళ్లను రెండు మూడు రోజులు గమనించి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత దొంగతనాలకు పాల్పడేవారని చెప్పారు. సుబేదారిలో జరిగిన ఓ దొంగతనం కేసులో వీరిపై నిఘా ఉంచి అధునాతన టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు.