జైలుకెళ్లిన ఆ వ్యక్తికి కరోనా… ఆస్పత్రి నుంచి పరార్

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిన ఖైదీ పరారైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు గ్వాలియర్ సెంట్రల్ జైలు పంపించారు. అతడికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తెలిపినట్లు సమాచారం.

Update: 2020-07-07 20:52 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిన ఖైదీ పరారైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు గ్వాలియర్ సెంట్రల్ జైలు పంపించారు. అతడికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తెలిపినట్లు సమాచారం.

Tags:    

Similar News