దారుణం.. ప్రియుడే కావాలని భర్తను అలా చేసిన భార్య

దిశ, మేళ్లచెరువు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్యే చంపేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన భూక్యా బాలాజీ(40) అనే వ్యక్తి పని కోసం 4 సంవత్సరాల క్రితం దుబాయ్ కి వెళ్లాడు. అయితే అతని భార్య బుజ్జీ అదే గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. దుబాయ్ కి వెళ్లిన బాలాజీ ఈ మధ్యే ఇంటికి తిరిగి […]

Update: 2021-10-10 08:02 GMT

దిశ, మేళ్లచెరువు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్యే చంపేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండాకు చెందిన భూక్యా బాలాజీ(40) అనే వ్యక్తి పని కోసం 4 సంవత్సరాల క్రితం దుబాయ్ కి వెళ్లాడు. అయితే అతని భార్య బుజ్జీ అదే గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. దుబాయ్ కి వెళ్లిన బాలాజీ ఈ మధ్యే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని శనివారం అర్థరాత్రి బాలాజీని గోడకు గుద్ది చంపేసింది. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడు. మృతుడి అన్న నెహ్రూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News