అమలు కానీ వాగ్దానాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు : భరత్ ప్రసాద్ కుమార్

పార్లమెంట్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం

Update: 2024-04-30 15:50 GMT

దిశ, రాజోలి : పార్లమెంట్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం రాజోలి మండలం కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భారత్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజోలి లో ముఖ్యంగా చేనేత, రైతుల, జూనియర్ కాలేజి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. అమలు కానీ వాగ్దానాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మళ్ళీ దొంగ వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి తయారయ్యాడు. దయచేసి తెలంగాణ ప్రజలు చైతన్యం కావాలని కోరారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే భారీ మెజారిటీ తో గెలిచే మొదటి స్థానం నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచే మొదలవ్వలని కోరారు.


Similar News