బాబు టవర్ దిగు.. 3 రోజుల్లో కంప్లీట్ చేస్తా

దిశ, హుజురాబాద్: తనకు న్యాయం చేయాలంటూ ఓ సెల్ టవర్ ఎక్కన సంఘటన హుజురాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆరెపల్లిలో బుధవారం గుంటి శ్రీనివాస్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన వాటాకు వచ్చిన భూమిని తన పేరు మీద చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా చేయడంలేదంటూ వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విన్నవించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ సురేష్ […]

Update: 2020-08-12 04:19 GMT

దిశ, హుజురాబాద్: తనకు న్యాయం చేయాలంటూ ఓ సెల్ టవర్ ఎక్కన సంఘటన హుజురాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆరెపల్లిలో బుధవారం గుంటి శ్రీనివాస్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన వాటాకు వచ్చిన భూమిని తన పేరు మీద చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా చేయడంలేదంటూ వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విన్నవించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ సురేష్ కుమార్ రెండుమూడురోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో అతను సెల్ టవర్ దిగాడు.

Tags:    

Similar News