అనంత్‎నాగ్‎‌లో ఉగ్రవాది హతం

దిశ, వెబ్‎డెస్క్: జమ్ము కశ్మీరులో జరిగిన ఎన్‎కౌంటర్‎లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అనంత్‌నాగ్ జిల్లా లార్నో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమచారంతో శనివారం జమ్ముకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు. మృతి చెందిన ఉగ్రవాది నుంచి ఏకే రైఫిల్‎ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి.

Update: 2020-10-16 22:07 GMT

దిశ, వెబ్‎డెస్క్: జమ్ము కశ్మీరులో జరిగిన ఎన్‎కౌంటర్‎లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అనంత్‌నాగ్ జిల్లా లార్నో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమచారంతో శనివారం జమ్ముకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు. మృతి చెందిన ఉగ్రవాది నుంచి ఏకే రైఫిల్‎ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి.

Tags:    

Similar News