బీజేపీ మొండి చేయి చూపిన ఐదు అంశాలు నచ్చాయి.. ఘంటా చక్రపాణి ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2024-05-03 11:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ మొండి చేయి చూపిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఐదు హామీలు తనకు నచ్చాయని, అవి అమలైతే నిజంగానే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రోఫెసర్ ఘంటా చక్రపాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం విడుదల చేసిన ప్రత్యేక మేనిఫెస్టోపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఐదు న్యాయాల కంటే తెలంగాణా కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా ఇచ్చిన హామీలే ఆకర్షణీయంగా ఉన్నాయని, అందులో ఐదు అంశాలు నచ్చాయని అన్నారు. అవి

  1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్. రీజియన్(ITIR) ప్రాజెక్ట్.
  2. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM), హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ
  3. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా
  4. హైదరాబాద్‌లో సుప్రీమ్ కోర్ట్ బెంచ్
  5. నూతన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు.

అని చెబుతూ.. బీజేపీ గత పదేళ్లలో మొండిచేయి చూపి, మోసం చేసిన ఈ హామీలు నిజంగానే అమలయితే తెలంగాణా రూపు రేఖలు మారిపోతాయి అని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని ఘంటా చక్రపాణి వెల్లడించారు.

Similar News