గోదావరిఖనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

దిశ, గోదావరిఖని: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్ స్టేషన్ ఎదుట జ్యోతినగర్‌లో చేసుకుంది.

Update: 2022-03-16 14:12 GMT

దిశ, గోదావరిఖని: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్ స్టేషన్ ఎదుట జ్యోతినగర్‌లో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేశవపట్నం మండలం మొలగనూర్ గ్రామానికి చెందిన పుదరి సమ్మయ్య (55), హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన నీలం సది (40)లు ఇద్దరు దిచక్ర వాహనంపై ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నడుచుకుంటూ వెళ్తున్న సీహెచ్ శంకరమ్మ అనే మహిళను ఢీకొట్టి, వెంటనే డివైడర్‌కు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సమ్మయ్య, నీలం సది అక్కడికక్కడే మృతి చెందగా, శంకరమ్మకు తీవ్ర గాయాలై కాలు విరగడంతో గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

Tags:    

Similar News