డబ్బు కోసం తండ్రితో గొడవ.. బాగా తాగేసి వచ్చి కర్రతో..

దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్ కు బానిస అయిన ఓ కుమారుడు డబ్బు కోసం తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా Llatest telugun news..

Update: 2022-03-14 03:18 GMT

దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్ కు బానిస అయిన ఓ కుమారుడు డబ్బు కోసం తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేసి తండ్రి చావుకు కారణమయ్యాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..నీరజ్ అనే యువకుడు డ్రగ్స్ కొనడానికి డబ్బు కోసం తన తండ్రి పురాణ్ కుష్వాహాతో డబ్బులు కావాలని గొడవ పడ్డాడు. కానీ నీరజ్ తండ్రి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. డ్రగ్స్ బానిస అయిన కుమారుడు ఆదివారం మద్యం మత్తులో వచ్చి మళ్లీ డబ్బులు అడిగాడు.

తండ్రి పురాణ్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో నీరజ్ తండ్రిని కర్రతో విచక్షణ రహితంగా కొట్టడం ప్రారంభించాడు. అది గమనించిన తల్లి తన భర్తను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నీరజ్ ఇద్దరిపై కర్రతో దాడి చేశాడు. వారి అరుపులు విన్న స్థానికులు పరిగెత్తుకు వచ్చి నిరాజ్ నుంచి వారిని కపాడి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడ్డ తండ్రి పురాణ్ కుష్వాహా(50) చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి విద్యాదేవి చికిత్స పొందుతుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపించారు. అలాగే కుమారుడు నీరజ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News