వ్యవసాయ భూమిలోకి బాట లేదని వ్యక్తి ఆత్మహత్య

తన వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు బాట లేకపోవడంతో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని మునిపంపుల గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2022-06-23 16:38 GMT

దిశ, రామన్నపేట : తన వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు బాట లేకపోవడంతో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని మునిపంపుల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఎం.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయ్యాడపు సత్తిరెడ్డి (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన వ్యవసాయ భూమిలోకి వెళ్ళడానికి బాట లేకపోవడంతో మనస్తాపానికి గురై గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని ఆయన తెలిపారు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News