TS High Court: సీఎం కేసిఆర్ కు బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు జారీ

Telangana High Court Serves Notice To CM KCR| టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర సర్కార్ భూమి కేటాయింపుపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. టీఆర్ఎస్ హైదరాబాద్‌ కార్యాలయం కోసం 4,935 గజాల

Update: 2022-06-23 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: Telangana High Court Serves Notice To CM KCR| టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర సర్కార్ భూమి కేటాయింపుపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. టీఆర్ఎస్ హైదరాబాద్‌ కార్యాలయం కోసం 4,935 గజాల అత్యంత ఖరీదైన భూమిని రూ.100కే గజం కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌ రాజ్‌ హైకోర్టులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ సీఎస్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Tags:    

Similar News