ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు బ్యూటీ..

హీరో నాగార్జున నటించిన ‘మన్మధుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు అంబానీ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Update: 2024-05-07 04:44 GMT

దిశ, సినిమా: హీరో నాగార్జున నటించిన ‘మన్మధుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు అంబానీ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించి తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. చేసింది కొన్ని సినిమాలే కానీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

అసలు అంత సడన్‌గా సినిమాల్లో నుంచి తప్పుకోవడానికి గల కారణాలను కూడా వివరించింది. తాను ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. తన పూర్వీకులు భారతీయులేనని తనకు 16 ఏళ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని.. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్‌ వచ్చిందని ఆ సినిమా చేసి మళ్ళీ లండన్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.

తాజాగా ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సందీప్ కిషన్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో, హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అన్షు కి దర్శకుడు కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ , తన పాత్ర నచ్చడంతో ఆమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆమెకు తెలుగులో రీఎంట్రీ సినిమాగా నిలవబోతున్నట్లు చెబుతున్నారు. మరి అవి ఎంత వరకూ నిజమో తెలియాలి అంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

Similar News