శంకరయ్య సేఫ్... కిడ్నాపర్ల చెర విడిపించిన పోలీసులు

జూన్ 22న ముంబాయిలో కిడ్నాప్ అయిన జగిత్యాల జిల్లా వాసి శంకరయ్యను పోలీసులు రక్షించినట్టుగా తెలుస్తోంది.

Update: 2022-07-03 10:06 GMT

దిశ, పెగడపల్లి: జూన్ 22న ముంబాయిలో కిడ్నాప్ అయిన జగిత్యాల జిల్లా వాసి శంకరయ్యను పోలీసులు రక్షించినట్టుగా తెలుస్తోంది. పాండిచ్చేరి ప్రాంతంలో కిడ్నాపర్ల చెరలో ఉన్న శంకరయ్యను సేఫ్‌గా పట్టుకున్న పోలీసులు ముంబాయికి తరలిస్తున్నట్టు సమాచారం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన శంకరయ్య ముంబాయిలో ఫ్లైట్ దిగిన కొద్దిసేపటికే అదృశ్యం అయ్యాడు. మూడు రోజులైనా ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ముంబాయి పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాపర్ల ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. కుంభకోణం, తంజావురుతో పాటు పలు ప్రాంతాల్లో గాలించిన పోలీసులు చివరకు పాండిచ్చేరిలో పట్టుకున్నట్టు సమాచారం. కొన్ని గంటల్లో శంకరయ్యతో సహా ముంబాయికి చేరనున్న పోలీసులు ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Tags:    

Similar News