PV Sindhu దూకుడు.. క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన తెలుగు తేజం

PV Sindhu enters into quarter finals in Malaysia Masters 2022| మలేషియా మాస్టర్స్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూసుకెళ్తోంది. కౌలాలంపుర్​ వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌‌లో విజయం సాధించింది.

Update: 2022-07-07 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : PV Sindhu enters into quarter finals in Malaysia Masters 2022| మలేషియా మాస్టర్స్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూసుకెళ్తోంది. కౌలాలంపుర్​ వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌‌లో విజయం సాధించింది. చైనాకు చెందిన జాంగ్ యి మాన్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. పీవీ సింధు రెండో రౌండ్లో ప్రపంచ నంబర్ 32 అయిన జాంగ్ యి మాన్‌పై వరుస సెట్లలో 21-12, 21-10తో గెలుపొందింది. ఇక క్వార్టర్ ఫైనల్లో సింధుకు గట్టి పోటీ ఎదురుకానుంది. చైనీస్ తైపీకి చెందిన తాయ్ ట్జు యింగ్‌తో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌లో తలపడనుంది.

Tags:    

Similar News