మంత్రి హరీశ్ రావు సంచలన నిర్ణయం.. మెడికల్ షాపుల బంద్‌కు ఆదేశం

Update: 2022-03-04 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులు కనుమరుగు కానున్నాయి.సర్కారీ దవాఖానాల ప్రాంగణాల్లో ఉండే ప్రైవేటు మెడికల్‌ షాపులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులే నేరుగా బ్రాండ్‌ పేర్లతో బయటి మెడికల్ షాపులకు రాస్తున్నారు. ఇది కోట్లాది రూపాయల వ్యాపారంగా మరడమే కాకుండా పేదలకు ఆర్థిక భారం పడుతుంది. వైద్యులు, మెడికల్‌ షాపులు కుమ్మక్కు కావడంతో ఈ పరిస్థితి నెలకొందన్న భావనలో సర్కారు ఉంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలో ప్రైవేటు మెడికల్‌ షాపులను తొలగించనున్నారు.

Tags:    

Similar News