PM Modi Bhimavaram Tour: జనంతో కిక్కిరిసిన మోడీ సభ.. పోలీసులను దాటుకొని దూసుకొస్తున్న జనం

PM Modi Participated Alluri Sitarama Raju's Birthday Celebrations in Bhimavaram| బీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభా స్థలి వద్ద జనం కిక్కిరిసిపోయారు.

Update: 2022-07-04 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: PM Modi Participated Alluri Sitarama Raju's Birthday Celebrations in Bhimavaram| బీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభా స్థలి వద్ద జనం కిక్కిరిసిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెదఅమీరం గ్రామం వద్ద జనాన్ని నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోలీసులను దాటుకొని జనాలు సభా స్థలి వైపు దూసుకొస్తున్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ బీమవరానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు తదితరులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News