ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణం బలి
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, షాద్నగర్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు యూటర్న్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని వ్యక్తి మీద నుంచి బస్సు వెళ్లడంతో తల నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఘటనా స్థలం కూడా భయానకంగా మారింది. రంగారెడ్ది జిల్లాలో షాద్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.