నిజాంసాగర్లో కరోనా కలకలం
దిశ, నిజాంసాగర్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరొనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది అనడంలో సందేహం లేదు....new case of COVID-19 in Nizam Sagar
దిశ, నిజాంసాగర్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరొనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది అనడంలో సందేహం లేదు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యశాఖాధికారులు నాలుగవ విడత కరోనా విజృంభిస్తుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నా అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో గ్రామీణ స్థాయిలో కరోనా పాజిటివ్ రావడంతో నిజాంసాగర్ మండలంలో కలకలం రేగుతోంది. శనివారం నిజాంసాగర్ మండలంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలడంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇకనైనా ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ ఉపయోగించాలని, వ్యక్తిగత దూరాన్ని పాటిస్తే కరోనా బారిన పడే అవకాశం ఉండదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.