నస్రీన్ బేగంను అభినందించిన మంత్రి కొప్పుల
దిశ, మహబూబ్ నగర్: ఇటీవల విడుదల అయిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం..Minister Koppula congratulated Nasreen Begum
దిశ, మహబూబ్ నగర్: ఇటీవల విడుదల అయిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్సుల ఫలితాల్లో మహబూబ్ నగర్ మైనారిటీ బాలికల గురుకుల కళాశాల -2కు చెందిన విద్యార్థిని నస్రీన్ బేగం 489/500 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కుమారి నస్రీన్ బేగంను సత్కరించి అభినందించారు. మైనారిటీ గురు కులాల ఫలితాలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఏకే ఖాన్, సెక్రటరీ షఫీయుల్లా సంబంధిత అధికారులను, కళాశాల ప్రిన్సిపాల్ ను మంత్రి అభినందించారు.