ఇంజక్షన్ వికటించి బాలిక మృతి

Update: 2022-03-14 02:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంజక్షన్ వికటించి ఏనిమిదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన జిల్లాలోని రావికమతం మండలం దొండపూడిలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. మౌనిక (8) కు చికెన్ ఫాక్స్ సోకడంతో బాలిక తల్లిదండ్రులు ఆమెకు స్థానిక మెడికల్‌లో ఇంజక్షన్ ఇప్పించారు. దీంతో కాసేపటి వరకు బానే ఉన్న మౌనిక ఒక్కసారిగా శరీరం రంగుమారి మరణించింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News