బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు కామాంధులు యువతిపై గ్యాంగ్ రేప్ చేసి కలకలం సృష్టించారు.

Update: 2022-03-25 13:42 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పనిమీద బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు బస్టాఫ్‌కు వచ్చిన ఓ ఒంటరి మహిళపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న ఓ మహిళ(33) పనిమీద జూబ్లీహిల్స్ నుండి కోఠికి వచ్చింది. కోఠి నుంచి తిరిగి జూబ్లీహిల్స్ వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది. ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్ మార్గమధ్యలో తన స్నేహితులకు కాల్ చేసి నగర శివారులోని జిల్లేల్‌గూడ‌లోని గాయత్రి నగర్‌‌కు తీసుకెళ్లాడు.

అక్కడ నుంచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి కష్టంగా వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రశాంత్(21), నితిన్(18), శ్రీను అనే ముగ్గురితో పాటు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటన అనంతరం వారి నుండి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags:    

Similar News